Posts

లెజెండ్‌ పీవీ

Image
  లెజెండ్‌ పీవీ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు బహుభాషా కోవిదుడు వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలతో అనుబంధం 2021 జూన్‌ 28 వరకు శత జయంతి వేడుకలు నిర్వహించనున్న తెలంగాణ ప్రభుత్వం పీవీకి భారతరత్న ఇవ్వాలి : కేసీఆర్‌ పీవీ మహా సముద్రమంలాంటి వాడు.. సముద్రంలా పైకి ప్రశాంతంగా కన్పించినా అతడి అంతర్మథనంలో కోటానుకోట్ల ఉప్పెనల శక్తి దాగి ఉన్న ఒక  మహోన్నత రాజకీయ, సాహిత్య యోధుడు. అలాంటి వ్యక్తిని భరత జాతికి సగర్వంగా అందించింది మన తెలంగాణ గడ్డ. ముందుచూపుతో ఆనాడు పీవీ అమలుచేసిన సంస్కరణల ఫలితంగా నేడు మన దేశం అనేక రంగాల్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. భారతదేశాన్ని పరిపాలించిన అందరి ప్రధానుల్లో ఒక భిన్నమైన రాజకీయ, పరిపాలన చతురతను అవలంభించిన వ్యక్తిగా పీవీని పేర్కొనవచ్చు. మౌనంగా చూసే చూపుల్లో వేలాది భావాలను ప్రసరింపజేయగల మహా తత్వవేత్త. యావత్‌ భారతదేశం గర్వించదగిన మన తెలుగు బిడ్డ పీవీ. రాష్ట్ర, దేశ రాజకీయాలలో పీవీ వేసిన ముద్ర ప్రత్యేకమైనది. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్‌ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించాడ...

ఇప్పటివరకు ఎండిపోని చెరువు ఏమిటో తెలుసా..?

Image
  ఇప్పటివరకు ఎండిపోని చెరువు ఏమిటో తెలుసా..? అనేక విశిష్టతలు ఈ చెరువు సొంతం కాకతీయుల పనితనానికి పరాకాష్ట 200 గ్రామాలకు తాగునీటి జంక్షన్‌ సుందరమైన దృశ్యాలతో ఆహ్లాదభరిత వాతావరణం ఎప్పుడైనా ఎక్కడైనా వరుసగా రెండుమూడేళ్ల పాటు వర్షాలు కురవకపోతే ఏ నీటి వనరైనా ఎండిపోవడం ఖాయం. అయితే ఇందుకు భిన్నంగా కాకతీయులు నిర్మించిన ఓ చెరువు మాత్రం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఎండిపోయిన దాఖలా లేదు. నిర్మాణ సమయంలో కాకతీయులు ఏం మాయచేశారో గానీ ఎంతటి కరువు పరిస్థితిలోనైనా ఆ చెరువులో నీరు ఇప్పటివరకు అడుగంటలేదు. సమీప గ్రామానికి చెందిన కురు వృద్ధులు సైతం ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. ప్రస్తుతం మనుగడ సాగిస్తున్న కురు వృద్ధులే కాక వారి తాతలు కూడా ఇదే విషయాన్ని వారికి చెప్పేవారని పేర్కొంటున్నారు. ఈ చెరువు ఎండిపోని విషయాన్ని భవిష్యత్‌ తరాలకు గుర్తుచేస్తుంటారు. తెలుగువారందరినీ ఏకం చేసి ఏకఛత్రాదిపత్యంగా వందల ఏళ్లు పరిపాలించిన ఘనత కాకతీయులకు దక్కిన విషయం తెలిసిందే. కాకతీయులు మంచి కళా పోషణతో పాటు అద్భుతమైన ఇంజనీరింగ్‌ ప్రతిభను కలిగిఉన్నట్లు అనేక అధారాల వల్ల మనకు స్పష్టమవుతోంది. రాజ్యాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశ...

చైతన్య దివిటీలు వార్త పత్రికలు

Image
చైతన్య దివిటీలు వార్త పత్రికలు స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర నిజాంలను ఎదిరించి నిలిచిన పలు పత్రికలు అవినీతి, ప్రజాసమస్యలపై నిత్యం యుద్ధభేరి ఎన్నో ప్రభుత్వాలను ప్రభావితం చేసిన న్యూస్‌ పేపర్లు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి చేతిరాత గోడపత్రిక స్థాయి నుంచి అత్యాధునిక ముద్రణ వైపు పయనం వేలాది మందికి ఉపాధి లక్షలాది విద్యార్థులకు దిక్సూచి ప్రజలకు చేరువలో రాజకీయం, సినిమా, వాణిజ్యం, క్రైం, కళలు, సాహిత్యం, క్రీడలు సోషల్‌ మీడియా రాకతో కొంత వెనుకడుగు అయినా తగ్గని ఆదరణ ప్రజల జీవన గమనాన్ని అనేక సందర్భాల్లో పత్రికలు ప్రభావితం చేశాయి. అలాగే మనిషి బతుకు ప్రవాహంలో కలగలిసిపోయి ఒక 'అవయవం'గా గుర్తింపు దక్కించుకున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రజల్లో నిరాశ, నిస్పృహలు ఆవహించి, సమాజంలో అనేక రుగ్మతలు బుసలు కొడుతున్న తరుణంలో నేనున్నానంటూ పత్రిక(లు) ముందుకు వచ్చి ప్రభావశీల చైతన్యాన్ని, ఉత్సాహాన్ని నింపాయి. ఎన్నో పోరాటాలకు, చారిత్రాత్మక ఘట్టాలకు నిలువెత్తు సాక్ష్యాలుగా పత్రికలు నిలిచాయని నొక్కి చెప్పవచ్చు. ఆంగ్లేయులు, నిజాంల పాలనతో పాటు పెత్తందారి వ్యవస్థ నుంచి నేటి ప్రభుత్వాల వరకు ఎన్నో అవినీతి, అక్రమాల...

వైవిధ్యాల ఝరి గోదావరి

Image
వైవిధ్యాల ఝరి గోదావరి దక్షిణ భారత గంగగా గుర్తింపు మూడు రాష్ట్రాల ప్రజల ఆదెరువు గోదావరి బేసిన్‌లో విలువైన ఖనిజ సంపద నదీ తీరం వెంట విలువైన అరణ్యాలు ఎన్నో పుణ్యక్షేత్రాలకు నెలవు గోదావరి కథాంశంతో అలరించిన సినిమాలు 'కాళేశ్వరం'తో తెలంగాణ సస్యశ్యామలం ఎన్నో బంధాలను, అనుబంధాలను పెనవేసుకుని గల గలల సవ్వడుతలతో కడలి వైపు కదులుతోంది గోదావరి తల్లి. ఎందరో అమాయక అడవి బిడ్డలకు ఆశ్రయమిస్తూనే ఆధునిక నాగరికతలను తనలో ఇముడ్చుకొని భావోద్వేగాలను, అనుభూతులను, ఆనందాలను పంచుతూ సాగిపోతోంది. దక్షిణ భారతంలో అతిపెద్ద నదిగా, భారతదేశంలో రెండవ అతిపెద్ద నదిగా భాసిల్లుతూ దక్షిణ గంగగా పేరుగాంచింది మన గోదావరి. మూడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఎన్నో వైవిధ్య భరిత వాతావరణాలను కలిగి, దట్టమైన అడవులకు ఆలవాలంగా నిలుస్తూ విలువైన ఖనిజ సంపదను తన గర్భంలో దాచుకుంది. లక్షలాది ఎకరాల మాగాణిని తడుపుతూ రైతన్నల గుండె ధైర్యంగా నిలుస్తోంది. గోదావరి ఒక జీవన ప్రవాహం. కోట్లాది ప్రజల గుండెచప్పుడు. అనేక ప్రాచీన నాగరికతలు నదీలోయ పరివాహక ప్రాంతాలలో అభివృద్ధి చెందాయి. నీటి వనరులు ఎక్కడైతే పుష్కలంగా ఉంటాయో అక్కడ మానవ మనుగడ అత్యంత సాఫీగా, ప్రశాంత...

సిరుల మాగాణి సింగరేణి

Image
  సిరుల మాగాణి సింగరేణి - వేలాది మందికి ఉపాధి - ఘనమైన చరిత్ర బొగ్గుబాయిల సొంతం - తెలంగాణ కల్పతరువు - దేశంలోని అనేక పరిశ్రమలకు బొగ్గు సరఫరా - కొద్దికాలం నిజాం ప్రభువుల ఆధీనంలో... - బ్రిటిష్‌ అధికారుల చొరవతో అంకురార్పణ - 1920లో పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీగా మార్పు - ఆధునిక యంత్రాల ప్రవేశం దేశ ప్రగతిలో పరిశ్రమల పాత్ర అత్యంత కీలకం. పరిశ్రమల వల్ల దేశం ముందడుగు వేయడంతో పాటు వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. అయితే తెలంగాణలో అత్యంత కీలకమైనది, ఎక్కువ మందికి ఉపాధి చూపుతున్న పరిశ్రమ ఏదంటే సింగరేణి బొగ్గుబావులని చెప్పకతప్పదు. బొగ్గుబాయిలు తెలంగాణ రాష్ట్రంలో వేలాది కుటుంబాలకు తిండికి లోటు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా సింగరేణి నిలుస్తోంది. నిజాంలు, బ్రిటీషు వారి సహకారంతో పురుడు పోసుకుని ఇంతితై వటుడింతై అన్నట్టు నాలుగు జిల్లాల్లో విస్తరించి నేడు కోట్ల టర్నోవర్‌తో దేశ ప్రగతిలో పాలుపంచుకుంటున్నది. అయితే సింగరేణి ప్రగతిలో కార్మికుల పాత్ర అంతా ఇంతా కాదు. అనుకూలించని వాతావరణం ఓవైపు... ఏవైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని సందిగ్ధత మరోవైపు... ప్రకృతికి విర...

ప్రకృతి గీసిన చిత్రం ఏటూరునాగారం అభయారణ్యం

Image
  ప్రకృతి గీసిన చిత్రం ఏటూరునాగారం అభయారణ్యం - గోదావరి సిగలో పచ్చ(ని)ల హారం - అడవితల్లి ఒడిలో ఎన్నెన్నో అందాలు - విభిన్న జంతు, వృక్ష జాతుల సమ్మేళనం - ప్రకృతి ప్రేమికులకు పసందైన నేల - తాడ్వాయి ప్రాంతంలో ఆదిమ మానవుల సమాధులు - ఔషద మొక్కలకు నెలవు మల్లూరు గుట్టలు - అతిపెద్ద గిరిజన జాతర మేడారం కొలువైంది ఇక్కడే - కొన్ని దశాబ్దాల పాటు 'అన్నలకు' ఆశ్రయమిచ్చిన ప్రాంతం ప్రకృతి ఎంత విచిత్రమైందో... భువిపై కొన్ని చోట్ల ప్రకృతి తన అందాలను ప్రసరింపజేసి మానవమాత్రులను ఒక నూతన జగత్తులోకి తీసుకెళ్లి ఓలలడిస్తుంటుంది. ఎంతటి మానవుడైనా ఒకసారి ప్రకృతి ఒడిలో అడుగిడితే ఒక రకమైన పరవశానికి లోనుకాక తప్పదు. నిత్య జీవితంలో ఒత్తిడిలు, సమస్యల వలయాల్లో చిక్కుకున్న వారు ఓసారి ప్రకృతిలో విహరిస్తే చాలు మనసు తేలికపడిపోవడం ఖాయం. ప్రకృతి చేసే మాయే అలాంటిది. అలాంటి కోవకే చెంది ఎన్నో జీవ వైవిద్యాలకు నెలవైనదే ఏటూరునాగారం అభయారణ్యం. వేలాది ఎకరాల్లో విస్తరించిన దట్టమైన అడవులు ఓవైపు... దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన గోదావరి నది మరోవైపు... వీటికితోడు మధ్య మధ్యలో ఎన్నో వాగులు, వంకలు, సెలయేళ్ల సవ్వళ్లను ప్రకృతి ఆరాధకులు పండుగ చేస...

అపురూప శిల్ప కావ్యాలు 'గణపురం కోటగుళ్లు'

Image
 అపురూప శిల్ప కావ్యాలు 'గణపురం కోటగుళ్లు' - ఎక్కడ లేని విధంగా 22 వరకు ఉప ఆలయాలు - శిథిలావస్థలో చారిత్రక సంపద - పట్టించుకోని పాలకులు - ప్రత్యేక రాష్ట్రంలో కూడా దక్కని ప్రాధాన్యం చుట్టు పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ శిల్పాల గుసగుసలు. ఆలయ ఆవరణలోకి అడుగిడగానే చరిత్ర లోతుల్లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. రాజుల కాలంలోకి వెళ్లామా అనే సంశయం ఒకవైపు  కలుగుతుండగానే ఇక్కడి శిల్పాలు మనతో మౌనంగా మాట్లాడడం ప్రారంభిస్తాయి. గున్న ఏనుగుల వరస మనకు స్వాగతం పలుకుతున్న భ్రమ నుండి బయటపడేలోపే అనేక శిల్ప రీతులు మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి.  ఆలయ సమీపంలో తాటిచెట్ల ఆకుల సవ్వడులు ఒకవైపు... పంట పొలాల పైనుంచి వీచే చల్లని గాలులు మరోవైపు.... శత్రు దుర్భుర్యంగా ఆలయం చుట్టూ నిర్మించిన మట్టికట్ట మధ్యలో ఇదొక అపురూప కట్టడం.. ఇక్కడి అద్భుతమైన శిల్పాలు మనలను మంత్రముగ్దులను చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. కాకతీయుల కట్టడాల శ్రేణిలో కలికితురాయిగా నిలిచే కట్టడంగా కోటగుళ్లను అభివర్ణించవచ్చు. ఇదొక అద్భుతమైన శిల్ప కావ్యంగా పేర్కొనవచ్చు. ఆలయ చరిత్ర.... క్రీ.శ. 1199-1260 మధ్య కాలంలో కాకతీయ సామ్రాజ్యాన...